సామాన్య గృహ భోజనము , విందు భోజనము , పండగ భోజనము - తద్దినపు భోజనము - వంటి అన్ని భోజనాలలో - నేతి వడ్డన తరువాత మాత్రమే - భోజనానికి ఉపక్రమిస్తారు .చేతిలో నేయి వేయటం - విస్తరి మీద నేయి వేయటం కూడా మనము చూస్తూనే వున్నాము .
నేటికీ నెయ్యి అనేది వేయకుండా భోజనం పెట్టరు . టన్నుల టన్నుల నేయి అమ్ముడు అవటమే దీనికి సాక్ష్యము .
" నేతిని ఎందువల్ల ఒక భోజనంలో తప్పని సరి దినుసుగా - భోజన ప్రారంభ కర్తగా లేదా భోజనము ప్రారంభించండి అన్న దానికి సూచన గా పెట్టారు ? అన్నది ఆలోచించ వలసిన విషయము
" అన్నము సంవృద్హిగా ( మీరు కోరినంత ) వున్నది - కోరి - తిని ఆనందించండి " అని అతిథికి భరోసా ఇవ్వటమే - నేతి వడ్డన లోని ఉద్దేశ్యము . దీనిలో నిఘాఢత ఏమి లేదు . చాలా సంప్రదాయాల వెనుక ఉద్దేశ్యాలు ఎట్లా మరుగున పడినాయో - అల్లాగే దీనిలోని అసలు ఉద్దేశ్యము కూడా మరుగున పండింది .
నేతిని వడ్డించకుండా భోజనం పెడితే - వున్నది పంచుకొని తినుచున్నాము " అని ఉద్దేశ్యము . పందిరి భోజనాలలో ఇది చూడవచ్చు .
ఒక నిండు విస్తరిలో నేయి వడ్డన అంటే - అన్నము మరియూ పప్పు+కూరలు అన్నీ సంవృద్హిగా - వున్నాయని సూచన .
" నేతి " వారు అనగా :నేతి " అనేది ఇంటిపేరుగా కలవారు వున్నారు . దాని అర్ధం - వారు తమ ఇండ్లల్లో ఏ భోజన కార్యక్రమము జరిపినా - పదార్దానికి ఏ లోటూ రానివ్వకుండా వండించి వడ్డన . చేసే కుంటుంబీకులు అని గుర్తు. అంటే వీరు ఫదిమందిని భోజనానికి పిలిచి - ఇరవై మందికి వండిచే వంశజులు అన్నమాట.