రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు,
కానీ
నాయకులు దేశంలో, వారి సంతానం
విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు.
*చేదు నిజం ఏమంటే*,
ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ పి.హెచ్.డి,
గ్రాడ్యుయేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం,
టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని,
వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం.
*ఆలోచించండి*.
ఏ రోజు ప్రత్యర్థిపై దాడుల్లో నాయకులు ఛస్తారో
నేతల పంటలకు అగ్గి తగులుతుందో
ఆరోజు నుంచే దేశంలో రాజకీయ దాడి- ప్రతి దాడులు అదృశ్యమవుతాయి.
*25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసినవాళ్లకు పెన్షన్ ఉండదు*.
కానీ,
ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం
*జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు* ఇస్తున్నారు.
ఇలా ఎందుకు ఇవ్వాలి?
నాయకులపైకి చెప్పులో, కోడిగుడ్లో, నల్ల సిరానో, విసిరితే
ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు.
కానీ,
భారతీయ సైన్యంపై రాళ్ల దాడి చేసేవాళ్లకు మాత్రం
మినహాయింపు ఇస్తారు. ఎందుకు?
రైతుల సరుకుల వాహనాలపై
తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు.
కానీ,
మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు.
*రైతు తినేది దొంగ సొమ్మా?*
*నేతలు తినేది కష్టార్జితమా?* ఇదేమి న్యాయం?
*విద్యలో రాజకీయం 100%*
*రాజకీయంలో విద్య 0%*
ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో.
ఇందుకేనేమో *రాజకీయం అంతా చెత్తతో నిండిపోయింది*.
దేశంలోని ప్రతిభావంతులేమో
వలస పక్షులు అవుతున్నారు.
దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ధర్మాసుపత్రుల్లో
పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలు కూడా
ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి -
వారి రోగాలకు చికిత్సలు కూడా
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి.
అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.
*₹399 కి అపరిమిత కాల్స్* డేటా దొరుకుతుంటే
ప్రజాప్రతినిధులకు నెలసరి *₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?*
*ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే
కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా?*
అందరూ ఆలోచించాలి.
దయచేసి మన దేశంలోని
ఇలాంటి *దరిద్ర వ్యవస్థ* గురించి
నేతలకు 15000 టెలిఫోన్ బత్తా యెందుకంటే వారి అఫీషియల్ ఫోన్ bsnl వారిది కదా అందుకని.
ReplyDelete