ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ.. బిల్ట్ ఇన్ మైక్, స్పీకర్లతో ఉన్న మాస్కును తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ముఖానికి మాస్క్ ధరించినా ఎదుటివారితో మాట్లాడేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా డిజైన్ చేసింది. దీంతో పాటు మరిన్ని ఫీచర్లను జోడించింది. వాయిస్ ఆన్ టెక్నాలజీతో తీసుకొచ్చిన ఈ మాస్కు ధరిస్తే మాట్లాడేటప్పుడు తీయాల్సిన అవసరం ఉండదని ఎల్జీ ప్రకటించింది. మాస్కు ధరించిన వ్యక్తి మాట్లాడినా అవతలి వారికి స్పష్టంగా వినిపిస్తుందని వెల్లడించింది. దీంతో చర్చల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మాస్కులు తీయాల్సి రాదని చెప్పింది. అలాగే మాస్కు బరువు కూడా తక్కువగా ఉండడంతో ఎక్కువ గంటలు ధరించినా విసుగుగా అనిపిందని వెల్లడించింది. 'ఎల్జీ యునీక్ ఎయిల్ సొల్యూషన్ టెక్నాలజీని ఇందులో వాడాం. ఈ ప్యూరికేర్ మాస్కు ఆల్రౌండ్ పర్మార్మెన్స్ చేస్తుంది.
మాస్కులోనే మైక్, స్పీకర్లు !
July 24, 2021
0