2016లో ఓ కెమెరా కన్ను అనుకోకుండా క్లిక్ మనిపించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె ఇప్పుడు ఐఏఎస్ అధికారిణి. ఈ ఫోటో తీసేనాటికి ఆమెకు వివాహం కాలేదు. కానీ ఈ ఫోటోలో ఆమెతో పాటు ఉన్నది అప్పుడు స్నేహితుడు, ఇప్పుడు ఆమె జీవన సహచరుడు. ఐఏఎస్ అధికారి కావాలనే కలతో 2015లో చాందినీ చంద్రన్ సివిల్స్ పరీక్షలు రాశారు. ఎంతో ఇష్టపడి..కష్టపడి పరీక్షలు రాశాక. ఆమె రిలాక్స్ అవ్వాలనుకున్నారు. అలా తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లారు. అదే సమయంలో వర్షం పడింది. అంతే ఇద్దరూ గొడుకు కింద చేరారు. అదే సమయంలో ఓ కెమెరా క్లిక్ మంది. అదే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఐఏఎస్ అధికారిణి చాందినీ చంద్రణ్ ఆమె భర్త కలిసి ఉన్న ఫోటో.
తర్వాతి రోజు పత్రికలో.. ''వేసవివి సెలవు. రాష్ట్రంలో అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉందంటూ చాందినీ చంద్రణ్, అరుణ్ సుదర్శన్ నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోను ఇందుకు జతచేసి పబ్లిష్ చేసి ఓ ఇంగ్లీషు పత్రికలో వేశారు.
కాకతాళీయంగా అదే రోజు సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలు వచ్చాయి. కానీ చాందినీ చంద్రన్ పాస్ కాలేదు. అరుణ్ సుదర్శన్ సదరు పత్రికా కార్యాలయానికి ఫోన్ చేసి, తమ ఫొటో ఎందుకు వేశారని నిలదీశారు. సదరు ఫొటోగ్రాఫర్తో మాట్లాడి ఇలాంటి ఫొటోలు అనుమతి లేకుండా పబ్లిష్ చేయటమేంటీ అని నిలదీశారు. ఇటువంటివి ప్రచురించేటప్పుడు వారి జీవితాలు ఏమవుతాయనే విషయం ఆలోచించరా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్న ఐఏఎస్ చాందినీ చంద్రణ్ గత జ్ఞాపకాలకు గుర్తు చేసుకున్నారు.
ఈ ఫోటోలో తప్పేమీ లేదు. కానీ కొన్నిసార్లు. కొన్ని సందర్భాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఎందుకంటే.. అప్పటికి మాకింకా పెళ్లి కాలేదు. కానీ ఈ తరువాత మేం వివాహం చేసుకున్నాం. ఇటీవలే ఈ ఫొటో గురించి గుర్తుకు రాగా, అరుణ్ సుదర్శన్ సదరు ఫొటోగ్రాఫర్ను సంప్రదించగా… ఆ ఫొటోకాపీని మాకు పంపించారు. ఇందుకు కేవలం థాంక్స్ అనే మాటతో సరిపెట్టలేను' అంటూ అలనాటి తమ ప్రేమకథను అనుకోకుండా జరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారామె. ఆ ఫోటో వెనుక ఉన్న తమ ప్రేమకథను తెలిపారు. ఆ తరువాత 2017లో నేను సివిల్స్ పరీక్షల్లో నా లక్ష్యం సాధించారు. పరీక్షల్లో పాస్ అయ్యాను. ఐఏఎస్ అయ్యాను అని తెలిపారు. ఇప్పుడు నేను త్రిపురలోని కాంచన్ పూర్ లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా డ్యూటీ చేస్తున్నానని చాందిని తెలిపారు.