చైనా కమ్యూనిస్ట్ పార్టీకి వందేళ్లు..!

Telugu Lo Computer
0


ఇక ఎప్పుడూ చైనా అణిచివేతకు గురికాదన్నారు. చైనాలోని పాలక కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం రాజధాని బీజింగ్ లో జిన్ పింగ్ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల సంబరాల నేపథ్యంలో బీజింగ్ కళకళలాడింది. మిలిటరీ విమానాలతో ఫ్లై పాస్ట్ నిర్వహించారు. శతఘ్నలను పేలుస్తూ సెట్యూల్ నిర్వహించారు. దేశభక్తి గీతాలను ఆలపించారు. గురువారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో చాలామందికి మాస్కులు ధరించలేదు. 

చైనాను బెదిరించాలని చూసే వాళ్లు ఉక్కు గోడకు తల బాదుకున్నట్లే అని ఈ సందర్భంగా జిన్ పింగ్ హెచ్చరించారు. అమెరికాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేస్తే వారి తలలు రక్తం చిందేలా చేస్తామన్నారు. చైనా పట్టుదలను ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దని, దేశ సార్వభౌమత్వాన్ని, జాతి సమగ్రతను కాపాడుకునేందుకు చైనా ప్రజలు వెనుకడుగు వేయరన్నారు. తైవాన్ ఏకీకరణ విషయంలో తమల్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు.

దేశాభివృద్ధిలో పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. ఆదాయాలను పెంచినందుకు మరియు నేషనల్ ప్రైడ్ పునరుద్ధరించినందుకు పార్టీపై ఈ సందర్భంగా జిన్ పింగ్ ప్రశంసలు కురింపించారు. నల్లమందు యుద్ధాలను లొంగదీసుకోవడం నుండి చైనాలో సోషలిస్టు విప్లవాన్ని స్థాపించే పోరాటం వరకు చైనా అనేక మలుపులు చూసిందని, కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పునరుజ్జీవనం తీసుకొచ్చి కోట్లాది మందిని పేదరికం నుండి బయటపడేలా చేసిందని అన్నారు

చైనా యొక్క గొప్ప పునరుజ్జీవనం…పూర్వస్థితిలోకి మార్చబడలేని చారిత్రక మార్గంలోకి ప్రవేశించిందని జిన్ పింగ్ అన్నారు. జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రపంచ స్థాయి మిలిటరీని నిర్మించడాన్ని కొనసాగిస్తానని జిన్ పింగ్ ప్రతిజ్ఞ చేశాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)