నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో ఆండ్రావారిపల్లెలో ఓ వ్యక్తి ఆటోలో కోడిగుడ్లను తెచ్చి 30 కోడిగుడ్లు రూ.130 కి అమ్మాడు. బయట ఆరు రూపాయలున్న ఉన్న గుడ్డు నాల్గున్నరకే వస్తుండటంతో జనాలు ఎగబడి కొన్నారు. అట్టలతో సహా గుడ్లను ఇచ్చాడు. గుడ్లను ఇళ్లకు తీసుకెళ్లి ఉడకబెడితే అవి ఎంత సేపటికీ ఉడక్కపోవడంతో గుడ్డును పరిశిలిస్తే గుడ్డుపై ఉన్న పెంకు ప్లాస్టిక్ పదార్థంగా ఉండి. లోపలి తెల్లసొన కూడా తేడాగా ఉండటంతో అవి నకిలీ కోడుగుడ్లుగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కోడిగుడ్లపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Post a Comment
0Comments
3/related/default