ప్రియురాలిని చంపిన పోలీస్

Telugu Lo Computer
0



గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన అజయ్ దేశాయ్ పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 2017లో అతడికి వివాహం అయ్యింది. అనంతరం మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది. గుడిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. కానీ…చట్టబద్ధంగా వివాహం చేసుకోవాలని, భార్యకు విడాకులు ఇవ్వాలని పట్టుబట్టింది. దీనితో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. భార్యకు విడాకులు ఇస్తే, భరణంగా ఆమెకు రూ. 25 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని..అంత డబ్బు ఇవ్వడం ఇష్టంలేని అజయ్..భార్యను అడ్డుతొగిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయం మీద అజయ్, ప్రియురాలి మధ్య గొడవయింది.  గొడవ ముదరడంతో ఆగ్రహానికి గురైన అజయ్ ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణలో అజయ్ చేసిన దారుణం వెలుగు చూసింది. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)