సూపర్ లగ్జరీ బస్సు దగ్ధం
July 23, 2021
0
హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న టిఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ దగ్గరకు రాగానే బస్సులో మంటలు వచ్చాయి. బస్సు వెనక వైపు నుంచి పొగలు వస్తున్నాయని ప్యాసింజర్లు డ్రైవర్ కు చెప్పడంతో బస్సును వెంటనే ఆపేసి ప్రయాణికులను దింపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలోబస్సులో 29 మంది ప్రయాణికులున్నారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది.