నాలుగు నెలల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు !

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్ లో నాలుగు నెలల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. ప్రస్తుత రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీని బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ సహా శనివారం డెహ్రాడూన్ లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై నూతన సీఎం ఎంపికపై చర్చలు జరిపారు. అనంతరం ఈ సమావేశంలోనే ఎమ్మెల్యేలందరూ పుష్కర్ సింగ్‌ను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. పుష్కర్ సింగ్ ఖతిమా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాలుగు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న తీరథ్ సింగ్ రావత్ నిన్న గవర్నర్ బేబీ రాణీ మౌర్యకు రాజీనామా అందజేయగా నేడు కొత్త సీఎంను ఎన్నుకున్నారు. దీంతో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి నాలుగు నెలల్లో మూడవ ముఖ్యమంత్రి ఎన్నికయ్యారు.



Post a Comment

0Comments

Post a Comment (0)