ఆగస్టు 15 వరకు ఎర్రకోట మూసివేత!

Telugu Lo Computer
0


ఢిల్లీలోని ఎర్రకోటను నేటి నుండి  ఆగస్టు 15 వరకు మూసివేస్తున్నట్లు పురావస్తు శాఖ ప్రకటించింది. సాధారణ ప్రజలకు, పర్యాటకులు సందర్శించేందుకు అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో డ్రోన్ల దాడి జరగొచ్చని నిఘావర్గాల హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వారం రోజుల ముందు ఎర్రకోటను మూసివేస్తారు. అయితే, ఈసారి నిఘా వర్గాల హెచ్చరికలు, ఢిల్లీ పోలీసుల సూచనలతో పురావస్తు శాఖ నేటి నుండి ఆగష్టు 15 వరకు మూసివేస్తున్నట్లు తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)