రాజస్థాన్‌లో భూకంపం

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లో భూకంపంశంలోని రాజస్థాన్, మేఘాలయ, లే-లడఖ్‌లలో బుధవారం ఉదయం భూకంప ప్రకంపనలు సంభవించాయి.  రాజస్థాన్‌లోని బికానీర్ లో భూకంపం తీవ్రత 5.3గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం తెలిపింది. ఉదయం 5 గంటల 24 నిమిషాల సమయంలో బికనీర్‌కు పశ్చిమ వాయువ్య దిశగా 343 కిలోమీటర్ల దూరంలో 110 కిలోమీటర్ల లోతులో 29.19 -అక్షాంశం 70.05- రేఖాంశల నడుమ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ట్విట్టర్‌లో వెల్లడించింది. అదే సమయంలో, మేఘాలయ మరియు లేహ్-లడఖ్‌లో కూడా వరుసగా 4.1 మరియు 3.6 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. ఈ మూడు ప్రాంతాలలో భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరిగినట్లు నివేదిక లేనప్పటికీ, భూకంపానికి  ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)