శుక్రవారం నుండి మందు పంపిణీ జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆనందయ్య తెలిపారు. ప్రభుత్వం ఇంకా అనుమతులు రాలేదని, రాగానే ముందుగా తేదీలను తెలిపి మందు పంపిణీ చేస్తామని చెప్పారు. ఔషధ తయారీకి కావలసిన ఆకులు, దినుసులు సిద్ధంగా లేవని ఆయన అన్నారు. వదంతులు నమ్మి ఎవరూ కృష్ణపట్నానికి రావద్దని కోరారు. ఇదిలాఉండగా ఆనందయ్య ఇస్తున్న మందులో ఎలాంటి హానికర పదార్ధాలు లేవని ఆయూష్ అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పడంతో అనుమతి ఎప్పుడు వస్తుందా అని అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఆనందయ్య మందుపై ఈనెల 29న ఆయుష్ నుంచి నివేదిక వస్తుందని
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్ జీ పీ ) సుమన్ చెబుతున్న నేపథ్యంలో తమ ముందు వుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.