కరోనాకు డీఆర్డీవో మందు ఒక్కో సాచెట్ను రూ.990గా నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన 2-డిజి (2-డీక్సీ - డి- గ్లూకోజ్)ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లో తయారు అవుతుంది. ఇప్పటికే ఈ మందును
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు 2-డీజీ ఔషధాన్ని డిస్కౌంట్ ధరకు అందజేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఆ డిస్కౌంట్ ఎంత వరకు ఉంటుందన్న వివరాలను వెల్లడించలేదు.
2-డీజీ ఔషధాన్ని హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్తో కలిసి డీఆర్డీవో ఆధ్వర్యంలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్’ అభివృద్ధి చేసింది
ఆక్సిజన్పై చికిత్స పొందుతున్న కరోనా రోగులు ఈ ఔషధం తీసుకున్న తర్వాత త్వరగా కోలుకుంటున్నారని ఇటీవల డీఆర్డీవో ప్రకటించింది. కరోనా రోగులు ఆక్సిజన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితులను తగ్గిస్తుందని తెలిపింది. పొడి రూపంలో ఉండే 2- డీజీ మందును నీటిలో కలుపుకొని తాగాల్సి ఉంటుంది.