రెండో దశ పోలింగ్ చాలా బాగుందని, ఈసారి కూడా ఎన్డీయేకు కలిసి వచ్చిందని 'ఎక్స్' వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ''ఫేజ్-2 కూడా చాలా బాగుంది. ఓటు వేసిన దేశప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్డీయేకు లభించిన అసాధారణ మద్దతు విపక్షాలకు మరింత నిరాశకు గురిచేస్తుంది. ఎన్డీయే సుపరిపాలనను ఓటర్లు కోరుకుంటున్నారు. యువకులు, మహిళా ఓటర్లు బలమైన ఎన్డీయే మద్దతును బలపరుస్తున్నారు'' అని మోడీ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. రెండో విడతలో భాగంగా అసోంలో 5, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 3, జమ్మూకశ్మీర్లో 1, కర్ణాటకలో 14, కేరళలో 20, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్రలో 8, మణిపూర్లో 1, రాజస్థాన్లో 13, త్రిపురలో 1, ఉత్తరప్రదేశ్లో 8, పశ్చిమబెంగాల్లో 3 లోక్సభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది.
రెండో దశ పోలింగ్ ఎన్డీయేకు కలిసి వచ్చింది !
April 26, 2024
0
Tags