మీడియాకు జైలు నుంచి నాలుగు పేజీల లేఖ విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత !

Telugu Lo Computer
0


తెలంగాణ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి నాలుగు పేజీల లేఖ మీడియాకు విడుదల చేశారు. లిక్కర్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వారు ఆరోపిస్తున్న విధంగా నాకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదని, లిక్కర్ కేసులో నేను బాధితురాలని అంటూ చెప్పుకొచ్చారు. రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటు తేలడం లేదని, మీడియా ట్రయిల్ ఎక్కువ జరుగుతుందని వివరించారు. సిబిఐ ఈడి ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతుందని, నా రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా వివరిస్తున్నారని తెలిపారు. నా మొబైల్ నెంబర్ ను అన్ని ఛానల్ వేసి నా ప్రైవసీ భంగం కలిగించారని కవిత లేఖలో పేర్కొన్నారు. .

Post a Comment

0Comments

Post a Comment (0)