శరవేగంగా నిర్మాణం కొనసాగుతోన్న రవితేజ మల్టీప్లెక్స్ థియేటర్ !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో ఏషియన్ రవితేజ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్ రవితేజ నిర్మిస్తున్నాడు. థియేటర్ నిర్మాణం దాదాపు పూర్తైంది. ఎల్ బీనగర్ దగ్గర్ లోని వనస్థలిపురం, హస్తినాపురం ఏరియాలో ఈ థియేటర్ ను నిర్మిస్తున్నారు. ఏషియన్ సంస్థతో కలిసి రవితేజ ఈ మల్టీప్లెక్స్ థియేటర్ ను నిర్మిస్తున్నారు. దీంతో ఈ థియేటర్ కి 'ఏఆర్టీ’ సినిమాస్ అని నామకరణం చేశారు. దీనికి సంబంధించిన ఫొటో ట్విట్టర్లో తెగ వైరల్ అవుతోంది. మొత్తం ఆరు స్క్రీన్స్ తో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ ను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఏషియన్ రవితేజ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఏషియన్స్ సినిమా ఇప్పటికే ముగ్గురు హీరోలతో కలిసి థియేటర్లు రూపొందించింది. మొదట 'ఏఎంబీ' సినిమాస్ పేరుతో మహేశ్ బాబు, ఏషియన్ థియేటర్స్ కలిసి శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో థియేటర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఏఏఏ' పేరుతో థియేటర్లు ఓపెన్ చేయగా, విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో 'ఏవీడీ' పేరుతో థియేటర్ ఓపెన్ చేశారు. ఇక ఇప్పుడు రవితేజ. 'ఏఆర్టీ' పేరుతో కొత్త థియేటర్ ఓపెన్ చేయనున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)