అమెరికాలో రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ విద్యార్థి మృతి !

Telugu Lo Computer
0


మెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థి వినేశ్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో విద్యార్థి చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక వైద్యుడు నవీన్-స్వాతి కుమారుడు ముక్క నివేశ్ (20) గతేడాది జనవరిలో ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో చేరాడు. ప్రస్తుతం నివేశ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాలకు వెళ్లి తిరిగి కారులో వస్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. దాంతో నివేశ్తో పాటు సహచర విద్యార్థి గౌతమ్ సైతం మృతి చెందినట్లు నివేష్ తల్లిదండ్రులు నవీన్, స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనపై అరిజోనా పోలీసులు సమాచారం అందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)