ఆంధ్రప్రదేశ్ లో వచ్చే రెండు, మూడు వారాల్లో నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బీజేపీ ఎంపీ అభ్యర్ధులు పోటీ చేస్తున్న సీట్లలో ఈ సభల నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. అందులోనూ ముఖ్యమైన నేతలు పోటీ చేస్తున్న సీట్లలో ప్రధాని మోడీ ప్రచారం చేయబోతున్నారు. ఆయా సభల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధాని మోడీ పాల్గొంటారు. ప్రధాని మోడీ రాష్ట్రంలో మొత్తం నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇందులో అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేట, మరో స్ధానంలో మోడీ ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారు. అనకాపల్లిలో బీజేపీ మాజీ ఎంపీ సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రంగంలో ఉన్నారు. అలాగే రాజంపేటలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. కడపలోనూ బీజేపీ నేత ఆదినారాయణరెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది. అదే జరిగితే కడప, రాజంపేట సభల్లో ప్రధాని పాల్గొనే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు బహిరంగ సభల్లో మోడీ పాల్గొనేలా షెడ్యూల్ ప్లాన్ ?
April 18, 2024
0
Tags