గ్రీన్ గ్రే హైడ్రోజన్ ప్రాజెక్టుకు బిడ్ వేసిన అంబానీ, టాటా, ఇండియన్ ఆయిల్ ?

Telugu Lo Computer
0


అంబానీ, టాటా, ఇండియన్ ఆయిల్ వంటి సంస్థలు రవాణా రంగంలో గ్రీన్, గ్రే హైడ్రోజన్ (GH2)ని ఉపయోగించేందుకు ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రోగ్రాంలో పాల్గొనేందకు బీడ్ వేశాయి. కేంద్ర ప్రభుత్వం దేశంలో ముడి చమురు వినియోగం, దిగుమతులను తగ్గించే కార్యక్రమంలో భాగంగా గ్రీన్ గ్రే హ్రైడోజన్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తుంది. దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి చేయబడితే.. ఎంతో చౌకగా ఉంటుంది. దీని ద్వారా వాహనదారులు పెట్రోల్, డిజిల్ కోసం లీటర్ కి రూ.100 కు పైగా చెల్లించాల్సిన అవసరం ఉండదు.. కేవలం రూ.20 నుంచి రూ.30తో కిలో మీటర్ కన్నా ఎక్కువ మైలేజ్ వచ్చే హైడ్రోజన్ వాహనాలను నడపవొచ్చు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు ఇంధనం ఉపయోగించడంలో సమస్యలు, సాంకేతిక డెవలప్ మెంట్, అమలులో మౌలిక అంతరాయలపై అధ్యయనం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం జీహెచ్ 2 పైలట్ ప్రోగ్రాం కోసం రూ.496 కోట్ల టండర్ ఫిబ్రవరిలో ప్రారంభించింది. రూ.19,744 కోట్ల నిధులతో జనవరి 2003 లో ఆరంభించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో ఇది ఒక భాగం. ఇదిలా ఉంటే.. టాటా నుంచి అంబాని వరకు దిగ్గజ కంపెనీలు అనే ఆసక్తికరమైన కూటములు ఏర్పడ్డాయి. కారణం ఇది ఒక్క కంపెనీతో చేయబడే పని కాదు. ఇప్పటికే రిలయన్స్ అశోక్ లేలలాండ్, డైమ్లర్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాటా మోటర్స్ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తో భాగస్వామ్యం, అశోక్ లేలాండ్ కూడా ఎన్‌టీపీసీ జాయిన్ వెంచర్. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ విజయం భారత దేశంలో పెను మార్పులుకు సూచకం అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)