జువెనైల్ హోం నుంచి పారిపోయిన ఎనిమిది మంది పిల్లలు ?

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని జువెనైల్ హోం నుంచి ఎనిమిది మంది పిల్లలు తప్పించుకున్నారు. సూరారం పరిధి కైసర్‌ నగర్‌లోని జువెనైల్ హోం నుంచి వీరంతా ఎస్కేప్ అయ్యారు. గమనించిన సిబ్బంది పిల్లల కోసం చుట్టుపక్కల అంతా గాలించారు. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సూరారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు తప్పించుకున్నారా..? లేక ఇంకేదైనా జరిగిందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ వారంతా పక్కా ప్లాన్ వేసి తప్పించుకున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)