మేము కట్టిన సెక్రటేరియేట్‌లో ఎందుకుంటున్నారు?

Telugu Lo Computer
0


తెలంగాణలోని మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ సెక్రటేరియేట్‌లో అంబేద్కర్ విగ్రహం పెట్టిన తర్వాత వచ్చిన మొదటి జయంతి ఇది. అలాంటిది విగ్రహానికి ఒక పువ్వు పెట్టలేదు, ఒక పూలమాల వెయ్యలేదు, అంజలి ఘటించలేదు అని మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తే కనీసం మంచి నీళ్లు పెట్టకుండా, విగ్రహం దగ్గరికి వెళ్లకుండా గేట్లకు తాళాలు వేశారు అని విరుచుకుపడ్డారు. మేము కట్టిన విగ్రహం దగ్గరికి వెళ్లనప్పుడు, మేము కట్టిన సెక్రటేరియేట్‌లో ఎందుకుంటున్నారు? మేము కట్టిన యాదగిరిగుట్ట దగ్గరకు ఎందుకు పోయి మొక్కుకున్నారు? మేము కట్టిన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎందుకుంటున్నారు? అని కెసిఆర్ ప్రశ్నించారు.సెక్రెటేరియేట్ లో సిగ్గు లేకుండా ఎందుకు కూసున్నరు? అని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)