బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌కు సంబంధించిన వీడియో మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ వేదికగా రిలీజ్?

Telugu Lo Computer
0


ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ త్వరలో పరుగులు పెట్టనుంది. 508 కిలోమీటర్ల మధ్య ట్రాక్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. బుల్లెట్ రైలు కోసం ప్రత్యేక రకం ట్రాక్‌ను రైల్వే శాఖ నిర్మిస్తోంది. తొలిసారిగా ట్రాక్‌కు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ వేదికగా రిలీజ్ చేశారు. దేశంలోనే తొలి బ్యాలస్ట్‌లెస్‌ ట్రాక్ విశేషాలను వివరించారు. బుల్లెట్ రైలు దృశ్యాలను యానిమేషన్ రూపంలో పొందుపరిచారు. హైస్పీడ్ రైళ్ల బరువును భరించేందుకు ప్రత్యేకంగా ట్రాక్ నిర్మించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ట్రాక్‌లో వేగం గంటకు 320 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)