నకిలీ మందులు తయారీ ముఠా అరెస్టు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో చాక్ పౌడర్, గంజితో నకిలీ మందులు తయారు చేస్తున్న బృందాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా మెడ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో మందుల విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం రూ.33 లక్షల విలువైన మందులను సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మాట్లాడుతూ ఫేక్ ప్రకనటలు చూసి మోసపోవద్దని సూచించారు. టీవీల్లో, సెల్ ఫోన్లలో ప్రకటనలు చూసి ఈ మధ్య టాబ్లెట్స్ కొనుగోలు చేయడం కామన్ అయిపోయిందని గుర్తుచేశారు. వీటిలో చాలా పెద్ద మోసం దాగుందని అనుమానం వ్యక్తం చేశారు. గుర్తింపు పొందిన మెడికల్ షాపుల్లోనే మాత్రలు కొనుగోలు చేయాలని సూచించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)