రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దు !

Telugu Lo Computer
0


తెలంగాణ  రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వేసవిలో విద్యుత్, తాగునీటి సరఫరాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పెరిగిన డిమాండ్ కు తగినట్టు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పంటలు ఎండిపోకుండా చూడాలన్నారు. ''రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. జూన్ వరకు బోర్లు, బావులు, ఇతర స్థానిక నీటి వనరులు వాడుకోవాలి. తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. గ్రామాల వారీగా కార్యాచరణ తయారు చేయాలి. పర్యవేక్షణ కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వాటర్ ట్యాంకులు సిద్ధంగా ఉంచాలి. ట్యాంకర్లు బుక్ చేస్తే 12 గంటల్లోపు చేరేలా చూడాలి'' అని సీఎం ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)