బలపరీక్షలో నెగ్గిన నాయబ్ సింగ్ సైనీ !

Telugu Lo Computer
0


ర్యానా అసెంబ్లీలో కొత్త ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ బల పరీక్షలో తన బలం నిరూపించుకున్నారు. మూజువాణి ఓటుతో కొత్త ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో హర్యానాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత నాయబ్ సైనీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్ భవన్లో గవర్నర్ను కలిసి తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల లేఖను ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేడు ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొన్నారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)