ఒడిశాలో అధికార బీజేడీ పార్టీ కటక్ ఎంపీ భర్తృహరి మహతాబ్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు పంపించారు. ముఖ్యమైన ఎన్నికలు జరుగుతున్న వేళ కీలక నేత పార్టీ వీడడం బీజేడీకి పెద్ద షాక్కే తగలింది. ఐదోసారి అధికారం కోసం ఎన్నికల రంగంలోకి దిగుతున్న నవీన్ సర్కార్కు ఊహించని దెబ్బగానే చెప్పొచ్చు. ఇటీవల ఒడిశా నటుడు అరిందమ్ రాయ్ బీజేడీకి గుడ్బై చెప్పి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేడీలో అరిందమ్ ముఖ్య నేతగా ఉన్నారు. ఎన్నికల సమయంలో హ్యాండిచ్చాడు. తాజాగా కటక్ ఎంపీ భర్తృహరి మహతాబ్ పార్టీని వీడారు. ఈయన కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేడీకి ఎంపీ భర్తృహరి మహతాబ్ రాజీనామా !
March 22, 2024
0
Tags