అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతదేశానికి చెందిన యువతి మృతి చెందినట్లు యూఎస్ లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘ఈ నెల 21న పెన్సిల్వేనియాలో జరిగిన కారు ప్రమాదంలో భారతీయ మహిళ, యువ ప్రొఫెషనల్ అర్షియా జోషి (21) మరణించింది. వారి కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని ఎక్స్ లో పేర్కొంది. జోషి మృత దేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలా సహాయం చేస్తామని, ఆమె కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నామని తెలిపింది. విదేశాల్లో నివసించే ప్రజలకు సహాయం చేసే టీమ్ ఎయిడ్ అనే స్వచ్చంద సంస్థ కూడా జోషి భౌతిక కాయాన్ని భారత్ కు పంపండంలో సహాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన జోషి గతేడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఓ సంస్థలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
అమెరికా రోడ్డు ప్రమాదంలో భారతీయ యువతి మృతి
March 24, 2024
0
Tags