చింతపండు కిలో రూ.40 ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పాడేరు, గుత్తులపుట్టు, జి.మాడుగుల, పెదబయలు, అన్నవరం, తాజంగి, చింతపల్లి, హుకుంపేట, వంట్లమామిడి, కించుమండ, అరకు, కాశీపట్నం వారపుసంతల్లో చింతపండు అమ్మకాలు జోరందుకున్నాయి. జిల్లా కేంద్రమైన పాడేరు పాతబస్టాండ్‌లో ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 9గంటల వరకు గిరిజనులు బుట్టలతో చింతపండును తీసుకువచ్చి విక్రయించారు. చింతపండు నాణ్యతను బట్టి 10 కిలోలు రూ.400 నుంచి 500 ధరతో వ్యాపారులు కొనుగోలు చేశారు. తూకం లెక్కన వ్యాపారులు కిలో రూ.40తో కొంటున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)