దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ సహా యూకే, జపాన్ కేంద్ర బ్యాంకులు ఈ వారమే నిర్ణయాలు తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సూచీలు రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. అయితే రిలయన్స్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్లో కొనుగోళ్ల మద్దతు కారణంగా సూచీలు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఉదయం 72,587.30 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం 12 గంటల వరకు లాభనష్టాల మధ్య కదలాడింది. ఆ తర్వాత కాస్త కోలుకుని ఇంట్రాడేలో 72,985.89 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 104.99 పాయింట్ల లాభంతో 72,748.42 వద్ద ముగిసింది. నిఫ్టీ 32.35 పాయింట్ల లాభంతో 22,055 పాయింట్ల వద్ద స్థిరపడింది.
స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ !
March 18, 2024
0
Tags