రెండో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ !

Telugu Lo Computer
0


లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసే 43 మంది అభ్యర్ధులతో మంగళవారం రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రాజస్దాన్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అభ్యర్ధులకు చోటు దక్కింది. రెండో జాబితాలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్కు చింద్వారా నుంచి అభ్యర్ధిత్వం లభించగా రాజస్ధాన్ జలోర్ నుంచి మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ను బరిలో దింపింది. ఇక కాంగ్రెస్ రెండో జాబితాలో రాజస్ధాన్ నుంచి 10 మంది అభ్యర్ధులు ఖరారయ్యారు. వీరిలో ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన రాహుల్ కస్వన్ పేరు ఉండటం గమనార్హం. టాంక్-సవోయి మాధాపూర్ నుంచి హరీష్ మీనాను కాంగ్రెస్ ఎంపిక చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)