యూట్యూబర్ జాన్వీ సింగ్ కాళ్లు మొక్కిన మోడీ !

Telugu Lo Computer
0


న్యూఢిల్లీ భారత్ మండపంలో జన్వీసింగ్ హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డును శుక్రవారం ప్రధాని మోడీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని మోడీ కాళ్లకుమొక్కిన జాన్వీ సింగ్ను మోడీ వద్దంటూనే ఆయన కూడా ప్రతిగా కాళ్లు మొక్కారు. దేశ ప్రధానితో ప్రశంసలందుకున్న జాన్వీ .. యూ ఆర్ గ్రేట్.. అని నెటిజన్లు మెచ్చుకున్నారు. ఈ అవార్డు పొందిన వారిలో గ్రీన్ ఛాంపియన్ విభాగంలో పంక్తి పాండే, ఉత్తమ స్టోరీ టెల్లర్ గా కీర్తిగా గోవిందస్వామి, కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గాయనీ మైథిలీ ఠాకూర్, టెక్ కేటగిరీలో ఉత్తమ క్రియేటర్ గా గౌరవ్ చౌదరి, ఫేవరేట్ ట్రావెల్ క్రియేటర్ గా కమియా జానీ అవార్డులను అందుకున్నారు. స్టోరీ టెల్లింగ్ , సోషల్ చేంజ్ అడ్వకేసీ, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, ఎడ్యుకేషన్ , గేమింగ్ తో సహా డొమైన్లలో గొప్పతనం, వాటి ప్రభావాన్ని గుర్తించి సృజనాత్మకతను సానుకూలంగా మార్చుకునే లాంచ్ ప్యాడ్ గా ఈ అవార్డును అందజేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)