బైక్‌పై వెళ్తున్న రైతు జంటను చూసి ఫిదా అయిన కారు యజమాని!

Telugu Lo Computer
0


సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు కారులో వెళ్తుండగా.. మార్గ మధ్యలో వారికి ఓ అరుదైన దృశ్యం కనిపిస్తుంది. ఓ పల్లెటూరి వ్యక్తి తన బైకు వెనుకవైపు గడ్డి మోపు కట్టుకున్నాడు. పొలం నుంచి గడ్డిని ఇంటికి వెళ్లే క్రమంలో భార్యను కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే బైకు వెనుక వైపు స్థలం లేకపోవడంతో చిన్న పిల్లల తరహాలో తన భార్యను ముందు వైపు పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టు్కోవడమే కాకుండా ఎంతో ప్రేమగా భార్యతో మాట్లాడుకుంటూ సరదాగా ఇంటికి బయలుదేరారు. కారులో వెళ్తున్న వారు వీరిని చూసి ఫిదా అయ్యారు. ఈ దంపతుల అన్యోన్యతను చూసి ఆశ్చర్యపోయారు. వారిని వీడియో తీస్తూ అలాగే చూస్తుండిపోయారు. కారులో వెళ్తున్న వారు వీడియో తీయడం చూసి బైకుపై వెళ్తున్న వ్యక్తి నవ్వుతూ పలకరించాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ''ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది''.. అంటూ కొందరు, ''పల్లెటూళ్లలో మాత్రమే ఇలాంటి వాళ్లను చూస్తుంటాం''.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 41వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)