కళ్యాణదుర్గం మండలంలో చిరుతలు హల్‌చల్‌ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో చిరుతలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వర్లి, భట్టువానిపల్లి గ్రామాల మధ్య నాలుగు చిరుతలు సంచరిస్తున్నాయి. దీంతో గ్రామ ప్రజలు బయటకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. నల్లగుట్టలోని గృహాలను స్థావరాలుగా చేసుకుని రెండు పెద్ద చిరుతలు,రెండు పులికూనలు సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. చిరుతల నుంచి గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బీట్ ఆఫీసర్లు గస్తీ కాస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)