తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ !

Telugu Lo Computer
0


తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 20 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 69,314 మంది భక్తులు దర్శించుకోగా 25,165 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.48 ఆదాయం వచ్చిందని తెలిపారు. తిరుమలలో ఈనెల 24న కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. తీర్థముక్కోటి రోజున భక్తులు తీర్థ స్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)