ద్రౌపది ముర్ము సామాన్య పౌరురాలిలో ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ద్రౌపది ముర్ము పసుపు రంగు చీర ధరించి రైలెక్కారు. ఆమెకు మెట్రో అధికారులు పలు వివరాలను వివరించారు. ఈ సమయంలో ముర్ము కూర్చున్న మెట్రో కోచ్ చుట్టూ పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది, అధికారులు ఉన్నారు. రాష్ట్రపతికి అత్యంత సమీపంలోని కోచ్లో ఆమె భద్రత కోసం ప్రత్యేక అధికారులు కూడా నల్ల బ్యాగ్తో తిరుగుతూ కనిపించారు. రాష్ట్రపతి పర్యటన ప్రజల దైనందిన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రజా రవాణాను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ఢిల్లీ మెట్రోలో పయనించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
February 07, 2024
0
Tags