ఊటీలో బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు దుర్మరణం !

Telugu Lo Computer
0


ఊటీ సమీపంలోని లవ్‌డేల్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కార్మికులను ఊటీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శిథిలాల కింద ఒకరు చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. పాత భవనాన్ని పునరుద్దరించే పనులు చేపట్టగా అందులో కొంత భాగం కుప్పకూలి పనిచేసే కార్మికులపై పడింది. ఆ సమయంలో దాదాపు 13 మంది కూలీలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మృతి చెందిన వారంతా మహిళలు. మృతులను సంగీత (35), షకీల (30), భాగ్య (36), ఉమ (35), ముత్తులక్ష్మి (36), రాధ (38)గా గుర్తించారు. మృతులంతా ఉతగై గాంధీనగర్‌కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. అయితే మరో కార్మికుడు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)