స్టాక్ మార్కెట్ లో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దూసుకుపోయాయి. ఇప్పటివరకు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్లు రూ.1 లక్ష కోట్ల విలువ కలిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులుగా అవతరించగా తాజాగా 'యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ' నాలుగో బ్యాంకుగా రికార్డులకెక్కింది. 2023లో యూబీఐ స్టాక్ ధర దాదాపు 50 శాతం పెరగడంతో ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ప్రతి త్రైమాసికానికి ఈ బ్యాంకు లాభాలను సాధిస్తోంది. ఉదాహరణకు 2023 జనవరిలో ఒకరు రూ.100 పెట్టుబడి పెడితే ఆ ఏడాది చివరకు 50 రూ.లాభంతో ఏకంగా 150 అయి ఉండేది. సుదీర్ఘకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు అంత ప్రాధాన్యానికి నోచుకోలేదు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రికవరీ రేటు పెరగడంతో.. ఒక్కసారిగా అవి మదుపరుల దృష్టిలో పడ్డాయి. మూడేళ్లుగా ఈ స్టాక్ ఏకంగా 316.87 శాతం పెరగడం గమనార్హం. గత ఏడు రోజులుగా 10.58 శాతం పెరిగింది. ఇవే కాదు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల లాభాలు పెరుగుతున్నాయి.
రూ.లక్ష కోట్ల విలువ కలిగిన బ్యాంకుగా అవతరించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా !
January 16, 2024
0
Tags