పంజాబ్ లోని అమృత్సర్కు సమీపం గ్రామంలో లోహ్రీ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఒక కుటుంబం సంబరాలు చేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు అంతా చాకచక్యంగా తప్పించుకున్నారు. కుటుంబ సభ్యులందరూ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. సంఘటన సమయంలో మంట పక్కనే వారంతా కూర్చున్నారు. వేడి ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించిందని అందులో ఒకరు వివరించారు. వారు ఇసుకను ఉపయోగించకుండా నేరుగా సిమెంటు నేలపై కలపను కాల్చారు. ఊహించని రీతిలో పేలుడు సంభవించడంతో కుటుంబ సభ్యులు, పిల్లలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
లోహ్రీ వేడుకల్లో అపశృతి !
January 14, 2024
0
Tags