లోకల్ రైలులో ప్రయాణించిన పారిశ్రామికవేత్త హీరానందానీ !

Telugu Lo Computer
0


ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్ దిగ్గజం, బిలియనీర్ హీరానందానీ కూడా ఇప్పుడు లోకల్ రైలులో ప్రయాణించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇతర ప్రయాణికులతో కలిసి ప్లాట్ ఫాంపై వేచి ఉన్న హీరానందానీ లోకల్ రైలులోని ఏసీ బోగీలో ఎక్కి థానే జిల్లా ఉల్లాస్ నగర్ రైల్వేస్టేషన్ వరకు ప్రయాణించారు. ఉల్లాస్ నగర్‌లోని సీహెచ్‌ఎం కళాశాలలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు రోడ్డు మార్గంలో వెళ్తే ట్రాఫిక్‌ కారణంగా సమయం వృథా అవుతుందని తాను భావించినట్లు హీరానందానీ అన్నారు. తాను ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు ట్రాఫిక్ అవరోధాలను అధిగమించడానికి లోకల్ రైలులో ప్రయాణించానని హీరానందానీ పేర్కొన్నారు. ఈ రైలు ప్రయాణంలో ఆయనతో పాటు కొందరు సభ్యులు వెంట ఉన్నారు. హీరానందానీ షేర్ చేసిన వీడియోకు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వస్తోంది. ఇప్పటి వరకు ఆయన వీడియోను 22 మిలియన్ల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. ముంబైలో ప్రజా రవాణాకు మూలస్తంభంగా ఉన్న లోకల్ రైలులో ప్రయాణించినందుకు హీరానందానీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దేశానికి ఆయన లాంటి వారు చాలామంది కావాలని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు 'సార్ మీరు తప్పు కోచ్‌లో ప్రవేశించారు. ఈ కోచ్‌లు వికలాంగులు, కేన్సర్ రోగులకు కేటాయించింది' అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)