బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జేడి(యు) అధ్యక్షుడు నితీష్ కుమార్ బీజేపీతో జతకట్టి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పరిణామాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్తో తిరిగి పొత్తు పెట్టుకున్నందుకు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోచవలసి ఉంటుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బీహార్లో కొత్తగా ఏర్పడిన కూటమి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగదని కిషోర్ జోస్యం చెప్పారు.
నితీష్ కుమార్ - బీజేపీ తాత్కలికమే !
January 28, 2024
0
Tags