డ్రీమ్11 యాప్‌లో గేమ్ ఆడి కోటిన్నర గెలిచిన గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌​ !

Telugu Lo Computer
0

బీహార్ లోని అరారియా జిల్లా సదర్ మండలం పటేగనా గ్రామానికి చెందిన సాదిక్ స్థానికంగా ఉండే ఉమా రాజ్​ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌​గా పనిచేస్తున్నాడు. క్రికెట్‌​పై ఆసక్తి కలిగిన సాదిక్ జనవరి 14న జరిగిన భారత్- అఫ్గానిస్థాన్​ మ్యాచ్‌లో రూ.49 పెట్టి డ్రీమ్​-11లో ఫాంటసీ గేమ్‌ ఆడాడు. ఈ మ్యాచ్​లో 974.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి రూ.కోటిన్నర గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా సాదిక్ మాట్లాడుతూ.. ఈ విజయంతో మా కుటుంబ సభ్యులు చాలా సంతోషిస్తున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా భారత్, అఫ్గానిస్థాన్​ మ్యాచ్‌​లో రూ.49తో గేమ్​ ఆడాను. మిలియనీర్​ కావాలనే నా కల కొన్ని గంటల్లోనే నెరవేరింది అని ఆనందం వ్యక్తం చేశాడు సాదిక్. కాగా, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సాదిక్ అప్పుడప్పుడు చిన్న మొత్తాలను గెలుచుకునేవాడు. ఈసారి మాత్రం ఏకంగా డ్రీమ్​-11 గేమ్​ టాలీ బోర్డ్‌​లో తొలి స్థానం వచ్చిందని చెప్పాడు. ఈ విషయం చెబితే సాదిక్​ను ఎవరూ నమ్మలేదు. పుకారుగా కొట్టిపారేశారు. కానీ సాదిక్​ ఖాతాలోకి డబ్బు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో సాదిక్​ను అభినందించేందుకు బంధువులు, మిత్రులు అతడి ఇంటికి క్యూ కడుతున్నారు. మరోవైపు, ఈ విషయంపై సాదిక్​ పని చేసే ఉమా రాజ్ గ్యాస్​ ఏజెన్సీ డైరెక్టర్ జితేంద్ర కుమార్​ సింగ్ స్పందించారు. సాదిక్ బ్యాంకు ఖాతాకు డబ్బులు వచ్చిన వెంటనే వాటిని ఫిక్స్​డ్​ డిపాజిట్ చేశామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)