ఆంధ్రప్రదేశ్ కి మైచౌంగ్‌ తుఫాను ముప్పు !

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రోజుల్లో తుఫానుగా బలపడి ఆంధ్రప్రదేశ్ లో కోస్తా జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మైచౌంగ్‌గా నామకరణం చేసిన ఈ తుఫాను డిసెంబర్ 4 లేదా 5వ తేదీన ఏపీ తీరానికి సమీపంగా వస్తుందని పేర్కొంది. అయితే, ఈ తుఫాను ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై ప్రస్తుతం చెప్పలేమని వాతావరణ శాఖ పేర్కొంది. డిసెంబర్ 3 నుంచి 5 తేదీల మధ్య దక్షిణ ఒడియా, ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఈ అల్పపీడనం మరింతగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ తుఫాను భారత ఆగ్నేయ తీరంపై ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరిల్లో శుక్రవారం నుంచి సోమవారం వరకూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. డిసెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. అల్పపీడనం కారణంగా కోస్తా ఆంధ్రలో 65.2 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకూ వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులను సముద్రం మీదకు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)