ఢిల్లీ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్బిఎస్) 9వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ అమ్మాయిలకు సరైన అవకాశాలు కల్పిస్తే అబ్బాయిలను మించి రాణించగలరని అన్నారు. ఈరోజు డిగ్రీలు అందుకుంటున్న 65 మంది విద్యార్థుల్లో 37 మంది యువతులని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. బాలికలకు తగిన అవకాశాలు కల్పిస్తే అబ్బాయిలను మించి రాణించగలరనడానికి ఇదో ఉదాహరణ అని సంస్థలోని వివిధ విద్యార్థులకు అవార్డులు పంపిణీ చేసిన అనంతరం రాష్ట్రపతి అన్నారు. ఈరోజు వైద్యరంగంలో అమ్మాయిలు ముఖ్యమైన సభ్యులుగా మారారని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. “ఈ రోజు డిగ్రీలు పొందుతున్న విద్యార్థులందరూ పెద్ద డాక్టర్లుగా మారారు” అని రాష్ట్రపతి అన్నారు. “మీరందరూ సూపర్ స్పెషలిస్ట్లుగా మీ బాధ్యతలను అత్యంత వినయం, సేవా ఆధారిత దృక్పథంతో నెరవేరుస్తారని నేను నమ్ముతున్నాను” అని ఆమె అన్నారు. 13 సంవత్సరాల కాలంలో ఐఎల్బిఎస్ తన ప్రత్యేక గుర్తింపును నెలకొల్పిందన్నారు.
సరైన అవకాశాలు కల్పిస్తే అబ్బాయిలను మించి అమ్మాయిలు రాణిస్తారు !
December 27, 2023
0
Tags