ఆప్‌ మంత్రి రాజ్‌కుమార్‌ నివాసంలో ఈడీ సోదాలు ?

Telugu Lo Computer
0


ఢిల్లీ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ ఇంట్లో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తోంది. మనీ లాండరింగ్‌ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఈడీ ప్రస్తుతం తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం తెల్లవారుజామునే అధికారులు మంత్రి ఇంటికి చేరుకొని సోదాలు మొదలుపెట్టారు. రాజ్‌కుమార్‌ ఆనంద్‌ ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖా మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేయడంతో ఢిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ కేసు విచారణలో భాగంగా నేడు ఆయన ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. గతంలోనూ ఆయనను సీబీఐ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. తమ నేతలపై ఈడీ దాడులను ఆప్‌ తీవ్రంగా ఖండిస్తోంది. దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు నిర్వహిస్తోందని ఆరోపించింది. దిల్లీ మద్యం విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా 2022 జులై 20న కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)