మాల్దీవులకు మొహమ్మద్ ముయిజ్జు అధ్యక్షునిగా ఈ నెల 17న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. భారత వ్యతిరేక హమీలతో ఆయన అక్కడి ప్రజల నుంచి ఓట్లు సంపాదించారు. ఇందులో ముఖ్యంగా మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను పంపించేస్తానని ఎన్నికల హమీ ఇచ్చారు. గతంలో ప్రెసిడెంట్గా ఉన్న ఇబ్రహీం సోలీహ్ భారత అనుకూలంగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే తమది చిన్న దేశమని, ఎవరితో శత్రుత్వం పెట్టుకోమని, భౌగోళిక రాజకీయ శత్రుత్వంలో చిక్కుకోమని అన్నారు. మాల్దీవుల విదేశాంగ విధానాన్ని ఇందులో నిమగ్నం చేయడంపై పెద్దగా ఆసక్తి లేదని అన్నారు. మాల్దీవులు భారత్, చైనాతో కలిసి పనిచేయబోతోందని ఆయన తెలిపారు. ఏఎఫ్పీ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖలు చేశారు.
ఎవ్వరితోనూ శత్రుత్వం పెంచుకోం !
November 15, 2023
0
Tags