తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలు

Telugu Lo Computer
0


క్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో రేపటికి ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని, దీని ప్రభావంతో 26 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27వ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం మీద వాయు గుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ  పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు యానాం లో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు / ఈశాన్య గాలులు వీస్తాయని రాబోవు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నవంబర్ 23న భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో చెదురుమదురు చినుకులు కురిశాయి. సాయంత్రం వరకు ఈ వర్షం తీవ్రమైంది, హయత్‌నగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో రాత్రి 7 గంటల వరకు 7 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. రానున్న మూడు రోజుల్లో అంటే నవంబర్ 25, 26, 27 తేదీల్లో.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌ అంచనా వేసింది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఫలితంగా వర్షాలు కురుస్తున్నాయని, ఇది రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)