మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వసాయ్ స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అక్టోబర్ 27 న సాయంత్రం కొన్ని కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. స్థానిక అధికారులు, రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పడానికి కారణమేంటో తెలియాల్సి ఉంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో కాసేపు పన్వేల్- వసాయ్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
October 27, 2023
0
Tags