మూడు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ !

Telugu Lo Computer
0


ఆమ్ ఆద్మీ పార్టీ మూడు రాష్ట్రాల్లో పోటీ చేయబోతుందని అరవింద్ కేజ్రీవాల్  వెల్లడించారు. ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీకి సిద్దమని కేజ్రీవాల్ ప్రకటించారు. వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాలలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మరోవైపు ఆప్ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. అయితే ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో ఆప్ కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తుందా..లేక ఒంటరిగా బరిలోకి దిగుతుందా అన్నది తెలియాల్సి ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)