ఖరీదైన అపార్ట్‌మెంట్‌లు చూడడానికి 8 గంటలు క్యూలో నిలబడ్డ కస్టమర్లు

Telugu Lo Computer
0


హారాష్ట్ర లోని పుణేలో రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లోపలి వెళ్లి అపార్ట్‌మెంట్‌లలో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఎనిమిది గంటల పాటు క్యూలో నిల్చున్నారు. ప్రధాన నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకాడ్ ప్రాంతంలో పొడవైన లైన్లు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను 'ఎక్స్‌' (ట్విటర్‌)లో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. దీనిపై యూజర్ల నుంచి మిశ్రమ కామెంట్స్ వచ్చాయి. చాలా మంది ఇది నమ్మశక్యంగా లేదన్నారు. అంత ఖరీదైన అపార్ట్‌మెంట్‌లను కొనేవారు అలా క్యూలో నిలబడ్డారని ఓ యూజర్‌ కామెంట్‌ చేశారు. కొంతమంది కిరాయి వ్యక్తులతో బిల్డర్ చేసిన మార్కెటింగ్ వ్యూహం కావచ్చని మరో యూజర్‌ అనుమానం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)