వాషింగ్‌ మెషిన్‌లో పెట్టి తరలిస్తున్న కోటి 30 లక్షల నగదు పట్టివేత !

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో హవాలా డబ్బును వాషింగ్‌ మెషిన్‌లో పెట్టి ఆటోలో తరలిస్తుండగా ఎయిర్‌పోర్ట్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. ఆటోలో పట్టుబడిన డబ్బుకు సంబంధించిన లెక్కలు, పత్రాలు చూపించకపోవడంతో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. కోటి 30 లక్షల రూపాయల నగదుతో పాటు 30 సెల్‌ఫోన్లు, ఆటో, బైక్‌ని సీజ్ చేసి సీఆర్పీసీ 41,102 సెక్షన్లు కేసు నమోదు చేశారు. ఈ డబ్బును విజయవాడకు ఆటోలో తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.  అయితే విశాఖలో పట్టుబడిన హవాలా మనీ ఎవరిది..ఎక్కడికి తరలిస్తున్నారే విషయం తెలియాల్సి ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)